1 మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను.
2 ఈ లాజరు ప్రభువుకు అత్తరు వూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
3 అతని అక్కచెల్లెండ్లు - ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
4 యేసు అది విని - యీ వ్యాధి మరణార్థమై వచ్చినది కాదు గాని దేవుని కూమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమార్థమై వచ్చినదనెను.
5 యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను.
6 అతడు రోగియైయున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండుదిములు నిలిచెను.
7 అటుపిమ్మట ఆయన - మనము యూదైయకు తిరిగి వెళ్లుదుమని తన శిష్యులతో చెప్పగా
8 ఆయన శిష్యులు - బోధకుడా, యిప్పుడే యూదులు నిన్నురాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.
9 అందుకు యేసు - పగలు పన్నెండు గంటలున్నవి గదా; ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుగ తొట్రుపడడు.
10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.
11 ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత - మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా
12 శిష్యులు - ప్రభువా, అదడు నిద్రించినయెడల బాగుపడుననిరి.
13 యేసు అతని మరణమును గూర్చి చెప్పెనను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.
14 -15. కావున యేసు - లాజరు చనిపొయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను.
16 అందుకు దిదుమ అనబడిన తోమా - ఆయనతో కూడ చనిపొవుటకు మనమును వెళ్లుదమని తనతోటి శిష్యులతో చెప్పెను.
17 యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.
18 బేతనియ యెరూషలేముకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను పరామర్శించుటకై వారియొద్దకు వచ్చియుండిరి.
20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్లెను గాని మరియు యింటిలో కూర్చుండియుండెను.
21 మార్త యేసును చూచి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.
22 ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదుననెను.
23 యేసు - నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా
24 మార్త ఆయనను చూచి - అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
25 అందుకు యేసు -నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
26 బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెనడిగెను.
27 , ఆమె - అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్మచున్నానని ఆయనతో చెప్పెను.
28 ఆమె యీ మాట చెప్పి వెళ్లి తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.
29 ఆమె విని త్వరగా లేచి ఆయనయొద్దకు వచ్చెను.
30 యేసు ఇంక ఆ గ్రామములోకి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనేయుండెను
31 గనుక యింటిలో మరియతో కూడనుండి ఆమెను పరామర్శంచుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.
32 అంతట మరియ యేసు ఉన్నచోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదములమీద పడి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.
33 ఆమె యేడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు - అతని నెక్కడనుంచితిరని అడుగగా,
34 వారు - ప్రభువా, వచ్చిచూడుమని ఆయనతో చెప్పిరి.
35 యేసు కన్నీళ్లు విడిచెను.
36 కాబట్టి యూదులు - అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.
37 వారిలో కొందరు - ఆ గుడ్డివాని కన్నులు తెరచినవాడైన యీయన యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.
38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.
39 యేసు - రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త - ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.
40 అందుకు యేసు - నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
41 అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారినిమిత్తమై యీ మాట చెప్పితిననెను.
43 ఆయన ఆలాగు చెప్పి - లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
44 చనిపోయినవాడు కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలిపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు - మీరు అతిని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.
45 మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి కాని
46 వారిలో కొందరు పరిసయ్యులయొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.
47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి - మనమేమి చేయుచున్నాము? ఈ మనష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే
48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులువచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.
49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండి - మీకేమియు తెలియదు.
50 (మన) జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.
51 తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక
52 యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకుమాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.
54 కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడినుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతోకూడ నుండెను.
55 మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరుషలేముకు వచ్చిరి.
56 వారు యేసును వెదుకుచు దేవాలయములో నిలువబడి - మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న పక్షమున తాము ఆయనను పట్టుకొనగలందులకై తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.
Download Audio File
2 ఈ లాజరు ప్రభువుకు అత్తరు వూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
3 అతని అక్కచెల్లెండ్లు - ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
4 యేసు అది విని - యీ వ్యాధి మరణార్థమై వచ్చినది కాదు గాని దేవుని కూమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమార్థమై వచ్చినదనెను.
5 యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను.
6 అతడు రోగియైయున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండుదిములు నిలిచెను.
7 అటుపిమ్మట ఆయన - మనము యూదైయకు తిరిగి వెళ్లుదుమని తన శిష్యులతో చెప్పగా
8 ఆయన శిష్యులు - బోధకుడా, యిప్పుడే యూదులు నిన్నురాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.
9 అందుకు యేసు - పగలు పన్నెండు గంటలున్నవి గదా; ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుగ తొట్రుపడడు.
10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.
11 ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత - మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా
12 శిష్యులు - ప్రభువా, అదడు నిద్రించినయెడల బాగుపడుననిరి.
13 యేసు అతని మరణమును గూర్చి చెప్పెనను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.
14 -15. కావున యేసు - లాజరు చనిపొయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను.
16 అందుకు దిదుమ అనబడిన తోమా - ఆయనతో కూడ చనిపొవుటకు మనమును వెళ్లుదమని తనతోటి శిష్యులతో చెప్పెను.
17 యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.
18 బేతనియ యెరూషలేముకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను పరామర్శించుటకై వారియొద్దకు వచ్చియుండిరి.
20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్లెను గాని మరియు యింటిలో కూర్చుండియుండెను.
21 మార్త యేసును చూచి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.
22 ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదుననెను.
23 యేసు - నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా
24 మార్త ఆయనను చూచి - అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
25 అందుకు యేసు -నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
26 బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెనడిగెను.
27 , ఆమె - అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్మచున్నానని ఆయనతో చెప్పెను.
28 ఆమె యీ మాట చెప్పి వెళ్లి తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.
29 ఆమె విని త్వరగా లేచి ఆయనయొద్దకు వచ్చెను.
30 యేసు ఇంక ఆ గ్రామములోకి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనేయుండెను
31 గనుక యింటిలో మరియతో కూడనుండి ఆమెను పరామర్శంచుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.
32 అంతట మరియ యేసు ఉన్నచోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదములమీద పడి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.
33 ఆమె యేడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు - అతని నెక్కడనుంచితిరని అడుగగా,
34 వారు - ప్రభువా, వచ్చిచూడుమని ఆయనతో చెప్పిరి.
35 యేసు కన్నీళ్లు విడిచెను.
36 కాబట్టి యూదులు - అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.
37 వారిలో కొందరు - ఆ గుడ్డివాని కన్నులు తెరచినవాడైన యీయన యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.
38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.
39 యేసు - రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త - ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.
40 అందుకు యేసు - నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
41 అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారినిమిత్తమై యీ మాట చెప్పితిననెను.
43 ఆయన ఆలాగు చెప్పి - లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
44 చనిపోయినవాడు కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలిపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు - మీరు అతిని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.
45 మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి కాని
46 వారిలో కొందరు పరిసయ్యులయొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.
47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి - మనమేమి చేయుచున్నాము? ఈ మనష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే
48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులువచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.
49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండి - మీకేమియు తెలియదు.
50 (మన) జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.
51 తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక
52 యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకుమాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.
54 కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడినుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతోకూడ నుండెను.
55 మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరుషలేముకు వచ్చిరి.
56 వారు యేసును వెదుకుచు దేవాలయములో నిలువబడి - మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న పక్షమున తాము ఆయనను పట్టుకొనగలందులకై తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.
Download Audio File
No comments:
Post a Comment